Sunday, July 1, 2012

బాబా మాటలు

1908 లో ఒకరోజు పండరి నుండి వచ్చిన   కృష్ణజీనూల్కర్  చావడిలో  ఉన్నాడు .
బాబా  శ్యామాతో , ఆ నూల్కర్ ను ధుని వద్ద స్తంభాని  పూజించుకొమ్మని చెప్పు 
అని అన్నారు సాయి . దేవా  మీకైతే చేస్తాము గాని స్తంభాన్నెందుకు  పూజిస్తాము ?
అన్నాడు శ్యామా .మొదట అంగీకరించని బాబా అతడు పట్టుబట్టిన  మీదట ఒప్పుకొన్నాడు .
ఇంతలో  నూల్కర్ పంచాంగం చూస్తే, నాడు [వ్యాసపూర్ణిమ]  గురుపూర్ణిమ .
తాత్య , దాదాకేల్కర్ ,శ్యామా  మొదలగువారు సాయిని పూజించారు . 
  


     

No comments:

Post a Comment