1912 సంవత్సరము లో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొతారే యను నతడు
షిర్డీ వచ్చెను .అతని మిత్రుడు ఐన భాయికృష్ణాజీ అలీ బాగకర్ అను నతడు వెంట వచ్చెను ..
షిర్డీ లో వారు సగుణ్ మేరు నాయక్ , జి .కే .దీక్షిత్ కు సన్నిహితులైరి. అనేక విషములు
తమలో చర్చించుకొనునప్పుడు సంభాషణ వసాస్తూ మొట్టమొదట షిర్డీ లో ప్రకటమై ,
తన గురుస్థానమని చెప్పిన వేపచెట్టు క్రింద పాదుకలు ప్రతిష్టించవలెననని నిశ్చ యించుకోనిరి .
పాదుకల నమూనా తో ఖండోబా మందిరముందున్న శ్రీ ఉపాసనీ మహారాజ్ వద్దకు పోగా
కొన్ని మార్పులు చేసి పద్మము , శంఖము , చక్రము,చేర్చి బొంబాయి లో చేయించిరి.
శ్రావణ పౌర్ణిమ రోజున ఉదయం 11గంటలకు జి. కే. దీక్షిత్ తన శిరస్సు పై పాదుకలు
పెట్టుకొని ఖండోబా మందిరం నుండి ద్వారకా మాయి కి ఉత్సవముతో వచ్చిరి . బాబా
యా పాదుకలు స్పృశించి అవి భగవంతుని పాదుకలని చెప్పిన తరువాత ఆ పాదుకలను
వేపచెట్టు క్రింద ప్రతిష్టించిరి . అప్పటిలో దీక్షిత్ పాదుకలకు నిత్య పూజ చేసినారు .నేటికి
2012 సంవత్సరము , శ్రావణ పౌర్ణిమనకు, గురుస్థానము లో పాదుకలు ప్రతిష్టించి
100 సంవత్సరములు పూర్తి వుతుంది . జై సాయి రామ్...
No comments:
Post a Comment