Saturday, July 14, 2012

బాబా మాటలు

శ్రీ గజననమహరాజ్ 1910  వినాయక చతుర్ధి  రోజున  మహాసమాధి చెందినారు .
వీరు సమాధి చెందిన యడున్నార  సంవత్సరములకు  1918   అక్టోబర్   15 న 
శ్రీ షిర్డీ సాయి బాబా మహా సమాధి  చెందారు .  శ్రీ సాయి బాబా సమాధి చెందిన 
ఏడున్నర   సంవత్సరములకు  శ్రీ తాజుద్దీన్  బాబా 1925 ఆగస్ట్  18 న 
మహాసమాధి చెందారు . విచిత్రమే మిటంటే  ఈ ముగ్గురు  మహాత్ములు  సమాధి 
చెందే నాటికి ఒకొక్కరి మధ్య షుమారు ఏడున్నర సంవత్సరములు . ఆ తరువాత 
మరల   ఏడున్నర ఏడున్నర సంవత్సరముల  నాటికి  శ్రీ గులాబ్ బాబా  జూలై 1 న 
1932 లో జన్మిచారు . ఇది దత్త సంప్రదాయము .  

Saturday, July 7, 2012

బాబా మాటలు

1912    సంవత్సరము లో  బొంబాయి నుండి  డాక్టర్  రామారావు కొతారే  యను నతడు
షిర్డీ వచ్చెను .అతని మిత్రుడు ఐన  భాయికృష్ణాజీ  అలీ బాగకర్ అను నతడు  వెంట వచ్చెను ..
షిర్డీ లో వారు సగుణ్  మేరు నాయక్ , జి .కే .దీక్షిత్  కు సన్నిహితులైరి.   అనేక విషములు 
తమలో చర్చించుకొనునప్పుడు సంభాషణ  వసాస్తూ   మొట్టమొదట షిర్డీ లో ప్రకటమై ,
 తన గురుస్థానమని  చెప్పిన  వేపచెట్టు  క్రింద పాదుకలు ప్రతిష్టించవలెననని   నిశ్చ యించుకోనిరి .
పాదుకల నమూనా తో ఖండోబా మందిరముందున్న శ్రీ ఉపాసనీ మహారాజ్  వద్దకు  పోగా
కొన్ని మార్పులు  చేసి  పద్మము , శంఖము , చక్రము,చేర్చి  బొంబాయి  లో చేయించిరి.
శ్రావణ పౌర్ణిమ రోజున ఉదయం 11గంటలకు  జి. కే. దీక్షిత్ తన శిరస్సు   పై  పాదుకలు 
 పెట్టుకొని  ఖండోబా  మందిరం  నుండి  ద్వారకా మాయి కి  ఉత్సవముతో  వచ్చిరి .  బాబా
యా పాదుకలు స్పృశించి అవి భగవంతుని పాదుకలని చెప్పిన  తరువాత  ఆ పాదుకలను 
వేపచెట్టు  క్రింద  ప్రతిష్టించిరి . అప్పటిలో  దీక్షిత్  పాదుకలకు  నిత్య పూజ చేసినారు .నేటికి 
2012   సంవత్సరము , శ్రావణ పౌర్ణిమనకు, గురుస్థానము లో  పాదుకలు   ప్రతిష్టించి
100  సంవత్సరములు పూర్తి వుతుంది .                 జై సాయి రామ్...
             

Sunday, July 1, 2012

బాబా మాటలు

1908 లో ఒకరోజు పండరి నుండి వచ్చిన   కృష్ణజీనూల్కర్  చావడిలో  ఉన్నాడు .
బాబా  శ్యామాతో , ఆ నూల్కర్ ను ధుని వద్ద స్తంభాని  పూజించుకొమ్మని చెప్పు 
అని అన్నారు సాయి . దేవా  మీకైతే చేస్తాము గాని స్తంభాన్నెందుకు  పూజిస్తాము ?
అన్నాడు శ్యామా .మొదట అంగీకరించని బాబా అతడు పట్టుబట్టిన  మీదట ఒప్పుకొన్నాడు .
ఇంతలో  నూల్కర్ పంచాంగం చూస్తే, నాడు [వ్యాసపూర్ణిమ]  గురుపూర్ణిమ .
తాత్య , దాదాకేల్కర్ ,శ్యామా  మొదలగువారు సాయిని పూజించారు .