Friday, March 25, 2016

బాబా భక్తులు-

                                                       రాధా కృష్ణఆయి  

         రాధా కృష్ణఆయి మొదటిసారి నానాసాహెబ్ చందోర్కర్ తో కలసి  1905 లో షిర్డీ కి వచ్చెను . ఆమె అసలు పేరు సుందరీ భాయి క్షీరసగర్. చిన్నతనములోనే భర్త మరణించుట వలన భంధు కోటిని ,కుటుంభ సభులను సభ్యులను  వదలి భగవంతుని సేవలో కాలము గడపినది . మొదటనుండి  ఆమె కృష్ణ  భక్తురాలు. నిరంతరము  కృష్ణ నామమును జపించుట వలన  ఆమెకు  రాధా కృష్ణఆయి  అని పేరు వచ్చినది . ఆమె ఎల్లప్పుడు కృష్ణ విగ్రహం దగ్గర ఉంచుకొని అన్ని సపర్యలు చేస్తూ ,తరుచు పండరిపురం దర్శిస్తుండేది . తదుపరి ఆమె శిర్దిలో తన సమయమంతా సాయి సేవలోను త్రీవ్రమైన సాధన లో  గడిపేది. 
          రాధా కృష్ణఆయి, బాబా సంచరించు మార్గము లన్నియు స్వయంగా చిమ్మి నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టేది. బాబా లెండీ తోట లోకి ,లేదా చావడి లోనికి వెళ్ళినప్పుడు మసీద్ చిమ్మేది, మరియు మసి బారిన గోడలు శుభ్రంగా  చేసేది. బాబా    తాను మధ్యాహ్నం   బిక్ష కు వెళ్లి వచ్చిన తరువాత శ్యామా ద్వారా ఆమెకు ఒక రొట్టె , కూర  నిత్యం పంపేవారు
అదే, ఆమె గురుబిక్షగా స్వీకరించేడిది.  ఆమె ఇంటిని'శాల'అనేవారు . అంటే బడి అని అర్ధం.    రాధా కృష్ణఆయిఇంటినుండి బయటకు వెళ్ళునప్పుడు ముఖం నిండుగా ముసుకు కప్పుకొని  వెళ్ళేది. ఎన్నో మాసాలు శిర్దిలో ఉన్న ఖపర్డే , ముసుకు లేకుండా ఆమెను చూడలేదని తన డైరీ లో  వ్రాసుకొన్నారు . కొందరు భక్తులను ఆమె ఇంటివద్ద బస చేయమని బాబా చెప్పెడివారు . 

        వామన్ రావ్   పాటిల్ ఎప్పుడు షిర్డీ వచినా ' ఆయ ' వద్ద గడిపేవాడు. ఆమె మాట్లాడే ప్రతిమాట సాయి మాటగా  తలచవచ్చునని ఆయన వ్రాసారు . ఆమె ఆయనకు భోజనం చేసేటప్పుడు , సంఖ్యా యోగంలో చెప్పిన తత్వాలకు సంకేతంగా భోజనాన్ని ఎలా భావించాలో చెప్పినది. ఇంతటి  భక్తురాలని సాయి తమ ఎదుటకు రానిచ్చే వారు కాదు. 
పొరపాటున ఒకసారి ఎదుటపడి నప్పుడు  ఆయన ఉగ్రులై  ఆమెపై రాళ్ళూ విసరి , త్రీవ్రంగా  తిట్టారు . 

      ఒకసారి శ్రీమతి తర్కాడ్ ను ఈమె ఇంట బసచేయమని సాయి చెపారు .కాని తను చెప్పిన పనులన్నీ  త్రికరణ శుద్దిగా  చేసేట్లయితేనే ఆమెకు ఆశ్రయమిస్తానన్నది . అందుకు అంగీకరించినది . చిన్న పొరపాటుకు ఆమె త్రీవ్రంగా చివాట్లు పెట్టేది. కాని రోజులు గడచినకొద్ది నిరంతర సాయి సేవ - సాయి ద్యానం వలన అయీ లో దివ్యదృష్టి దివ్యశ్రవణం , ఇతురుల భావాలు గ్రహించటము వంటి శక్తులను శ్రీమతి తర్కాడ్  గుర్తించినది.    

      రాధా కృష్ణఆయిలో బాబాపట్ల శ్రద్ద భక్తులతో పాటు విశిష్టమైన అధికారము , ఆకర్షణ ఉండేవి. ఆమె ఏదైనా చెబితే కోటేశ్వరుడైనబూటి  దగ్గర నుండి అందరు తలవంచి పనిచేసినారు . బాబా నడచి వెళ్ళు  లెండీ తోటకు, ఇరు వైపులా ఇనుప కమ్మీలు నాటి లతలు నాటినారు . నిత్యము నీళ్ళూ పోసి బాగా అల్లుకోనునట్లు చేసినారు .    

        నిజానికి రాధా కృష్ణఆయి శిర్దిలో గడిపినది తొమ్మిది సం// మాత్రమె . ఆమె తన 35వ యేట ఈ లోకం నుండి వెళ్ళిపోఇనది . మిగిలిన భక్తులు సాధించలేనిది, సాయి సంస్థాన వైభోగం ఆమె 9వసంతాలలో సాదించి నది 



Sunday, March 13, 2016

బాబా మాటలు

శ్రీ సాయినాధ స్థవనమంజరి  అను ఈ గ్రంధమును బాబాకు అత్యంత ప్రీతీపాత్రుడైన శ్రీ దాసుగణు మహరాజు అనువారు 9-9-1918గణేష్ చతుర్థి సోమవారం రోజున బాబా ప్రేరణ తో  నర్మదా నది తీర మహేశ్వర క్షేత్రములో రచించి ,శిర్దిలో శ్రీ ద్వారకామాయీ నందు సుఖా సీనుడై ఉన్న శ్రీ సాయిప్రభు ఎదుట దీనిని గానము చేస్తూ సాయికి అంకితము ఇచ్చారు . శ్రీ సాయి ప్రభు తన్మయత్వంతో, చిరునవ్వుతో దీనిని ఆలకించి ఆశీర్వదించారు. ఈ స్తోత్రమును శిర్దిలో నిత్యము 11సార్లు ,7రోజులు పారాయణ చేసినచో శ్రీ సాయి  సందర్శన  భాగ్యము నిస్సందేహముగా  లభించును .