Monday, October 15, 2012

బాబా మాటలు

ఆద్యంతాలు  లేని యీ పాదాలు  పరమ  పవిత్రమైనవి . నాపై   పూర్తి
విశ్వాసముంచు , నీ  కోరిక  నెరవేరుతుంది .  నా  పై  నీ  దృష్టి  నిలుపుము .
నేనూ  నీపై  దృష్టి   నిలుపుతాను . నిన్ను చివరికంటా  గమ్యం  చేరుస్తాను .
నన్ను  నమ్మినవారిని  పతనం కానివ్వను. నన్నే ధ్యానించి , నా  లీలలు
గానం  చేసేవారు నేనుగా  మారిపోతారు ; వారి కర్మ  నశిస్తుంది.  నేను 
వారి చెంతనే  వుంటాను .  నా   సమాధి  నన్నాశ్రయించిన  వారితో
మాట్లాడుతుంది .  నా  సమాధి  నుంచి  నుండి   నా కర్తవ్యం  నిర్వహిస్తాను .
నా  నామం పలుకుతుంది .  నా మట్టి  సమాధానము  చెబుతుంది .



No comments:

Post a Comment